
న్యూఢిల్లీ: దేశంలో ఇంధన లభ్యతపై వస్తున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేసింది. వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అన్ని రకాల ఇంధనాల సరఫరా వ్యవస్థ పటిష్టంగా ఉందని వెల్లడించింది.
కేంద్రం వెల్లడించిన కీలక అంశాలు:
-
సరఫరాలో ఆటంకాలు లేవు: కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) మరియు పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) సరఫరా ఎక్కడా ఆగలేదని, యథావిధిగా సాగుతోందని పేర్కొంది.
-
రిఫైనరీలు ఫుల్ కెపాసిటీ: దేశంలోని చమురు శుద్ధి కర్మాగారాలు (Refineries) అన్నీ పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని, దేశానికి సరిపడా క్రూడ్ ఆయిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపింది.
-
అదనపు గ్యాస్ రాక: ఎల్పీజీ కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. శివాలిక్, నందాదేవి నౌకల ద్వారా మరో 92,712 టన్నుల ఎల్పీజీ (LPG) త్వరలోనే భారత్ చేరుకోనుందని కేంద్రం వివరించింది.
-
పెట్రోల్ పంప్స్ అప్డేట్: దేశవ్యాప్తంగా పెట్రోల్ పంప్లలో ఎక్కడా స్టాక్ కొరత లేదని, వాహనదారులు కంగారు పడి అదనంగా నిల్వ చేసుకోవాల్సిన అవసరం లేదని సూచించింది.

