
లండన్/హైదరాబాద్: సన్రైజర్స్ గ్రూప్కు చెందిన ‘సన్రైజర్స్ లీడ్స్’ టీమ్, పాకిస్థాన్కు చెందిన మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను భారీ ధరకు దక్కించుకుంది. 2008 ముంబై దాడుల తర్వాత ఐపీఎల్ ఫ్రాంచైజీలు పాక్ ఆటగాళ్లను తీసుకోవడం నిలిపివేయగా, ఇప్పుడు విదేశీ లీగ్లోనైనా ఒక ఇండియన్ ఓనర్ పాక్ ప్లేయర్ను కొనడంపై భారత అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు.
లలిత్ మోదీ ఏమన్నారంటే? ఈ వివాదంపై స్పందించిన లలిత్ మోదీ, కావ్యా మారన్ను ఉద్దేశించి పరోక్షంగా చరఖా విసిరారు.
“అభిమానులు ఇప్పటికే తీవ్ర ఆగ్రహంతో ఉన్న సమయంలో.. ఒక పాకిస్థాన్ ఆటగాడిపై ₹2.34 కోట్లు ఇన్వెస్ట్ చేయడమా? ప్రజాభిప్రాయాన్ని (Optics) ఎలా మేనేజ్ చేయాలో, సామ్రాజ్యాలను ఎలా నిర్మించాలో నాకు బాగా తెలుసు. నాకు కాల్ చెయ్.” అని మోదీ ఎక్స్ (X) లో పోస్ట్ చేశారు.
వివాదానికి కారణాలు:
-
మొదటి పాక్ ప్లేయర్: ఐపీఎల్ ఫ్రాంచైజీకి అనుబంధంగా ఉన్న జట్టు ఒక పాక్ ప్లేయర్ను కొనుగోలు చేయడం ఇదే మొదటిసారి.
-
గవాస్కర్ విమర్శలు: టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ సైతం ఈ నిర్ణయాన్ని తప్పుబట్టారు. పాక్ ఆటగాళ్లకు ఇచ్చే డబ్బు పరోక్షంగా దేశానికి వ్యతిరేకంగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
-
సోషల్ మీడియా నిరసన: ఈ కొనుగోలుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నెటిజన్లు
#BoycottSunrisersఅనే హ్యాష్ట్యాగ్ను ట్రెండ్ చేశారు. ఈ క్రమంలో సన్రైజర్స్ లీడ్స్ అధికారిక ఎక్స్ ఖాతా కూడా తాత్కాలికంగా నిలిపివేయబడింది.

