
నల్గొండ: జిల్లాలో ఇసుక, చెరువు మట్టి అక్రమ రవాణాపై అధికారులతో కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్చంద్ర పవార్ శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్డీఓలు, తహసీల్దార్లు, డీఎస్పీలతో మాట్లాడిన కలెక్టర్.. అక్రమ తవ్వకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు.
కీలక ఆదేశాలు ఇవే:
-
వాహనాల సీజ్: అనుమతి లేకుండా ఇసుక, మట్టి తరలించే ఏ వాహనాన్నైనా వెంటనే సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు.
-
నిఘా నీడలో చెరువులు: ముఖ్యంగా అన్నేశ్వరమ్మగుట్ట చెరువు, కనగల్, తిమ్మాన్నగూడెం చెరువుల వద్ద నిరంతర నిఘా ఉంచాలని సూచించారు.
-
కొత్త ఇసుక రీచ్లు: ప్రజల అవసరాల నిమిత్తం వేములపల్లి మండలం బొమ్మకల్, రావులపెంట గ్రామాల్లో కొత్తగా రెండు ఇసుక రీచ్లను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
-
ఇందిరమ్మ ఇళ్లకు వెసులుబాటు: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన ఇసుకను ప్రభుత్వ నిబంధనల ప్రకారం సులభంగా అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
-
మూడు రోజుల గడువు: అక్రమ తవ్వకాలను కేవలం మూడు రోజుల్లోనే పూర్తిగా నిరోధించాలని పోలీస్, రెవెన్యూ శాఖలకు ఎస్పీ శరత్చంద్ర పవార్ స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించారు.
అవగాహన కార్యక్రమాలు: కేవలం శిక్షలే కాకుండా, ఇసుక తరలించే డ్రైవర్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి వారికి చట్టబద్ధమైన విధానాలపై అవగాహన కల్పించాలని మైనింగ్ అధికారులకు సూచించారు. జిల్లా అభివృద్ధికి ఇసుక అవసరమని, అయితే అది చట్టబద్ధంగానే జరగాలని అధికారులు నొక్కి చెప్పారు.

