
1. ఇందిరాపార్కు వద్ద మహాధర్నా – జీవో 17 రద్దు డిమాండ్:
తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కాంట్రాక్టర్ల జేఏసీ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద జీవో 17 (GO 17) ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన మహాధర్నాకు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
-
శ్వేతపత్రం డిమాండ్: కాంగ్రెస్ ప్రభుత్వంలో చిన్న కాంట్రాక్టర్లకు ఇచ్చిన నిధుల టెండర్లపై తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
-
రిజర్వేషన్ల మోసం: చేవెళ్ల, కామారెడ్డి డిక్లరేషన్ల పేరుతో ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 72 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని నమ్మబలికారని మండిపడ్డారు. కానీ ఇప్పుడు జీవో 17ను తెచ్చి చిన్న చిన్న కాంట్రాక్టులను కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
-
బీఆర్ఎస్ పోరాటం: జీవో 17ను రద్దు చేసేంతవరకు బీఆర్ఎస్ పక్షాన పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంట్రాక్టులన్నీ సీఎం రేవంత్రెడ్డి బామ్మర్ది, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కొడుకు, మరియు బీజేపీ నేతలకే దక్కుతున్నాయని ఆరోపించారు.
-
2028లో బీఆర్ఎస్ విజయం: వచ్చే 2028 ఎన్నికల్లో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని, రాష్ట్రంలో 50 వేల మందిని కొత్తగా కాంట్రాక్టర్లుగా తీర్చిదిద్దుతామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
-
పాల్గొన్న ప్రముఖులు: ఈ ధర్నాలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, జేఏసీ చైర్మన్ మందా శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
2. ముషీరాబాద్ బీఎల్ఏ సమావేశం – సీఎం రేవంత్పై వ్యంగ్యాస్త్రాలు:
ముషీరాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్ అధ్యక్షతన జరిగిన బూత్ లెవల్ ఏజెంట్స్ (బీఎల్ఏ) సమావేశంలో కేటీఆర్ పాల్గొని ముఖ్యమంత్రిపై తీవ్ర విమర్శలు చేశారు.
-
ఇళ్ల కూల్చివేతలపై ఆగ్రహం: జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఇళ్లయినా కట్టిందా? అంటూ సీఎం రేవంత్రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. ఇళ్లు కట్టడం పక్కనబెట్టి, ఎంత మంది పేదల ఇళ్లు కూల్చి వారి ఉసురుపోసుకున్నారో తెలుసా అంటూ మండిపడ్డారు.
-
ఆరు గ్యారంటీలపై వ్యంగ్యం: ‘నూరు రోజుల్లోనే ఆరు గ్యారంటీల అమలు ఏమైందని ప్రశ్నిస్తే.. కండలు తిరిగిన పహిల్వాన్ అయినా మూడు నెలల్లోనే పిల్లలను పుట్టిస్తారా… అని గతంలో సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. మరి ఇప్పుడు 30 నెలలైనా ఆ గ్యారంటీలు అమలు కాకపోతే నిన్ను ఏమనాలి?’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
-
నిరుద్యోగుల మోసం: ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అధినేత రాహుల్గాంధీ నగర కేంద్ర గ్రంథాలయానికి వచ్చి కేసీఆర్, కేటీఆర్ల ఉద్యోగాలు ఊడగొడితే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ నేడు అదే నిరుద్యోగులు సెక్యూరిటీ లేకుండా రాహుల్, రేవంత్లు ఎక్కడ దొరుకుతారా అని రోడ్లపై ఎదురుచూస్తున్నారని దుయ్యబట్టారు.
-
పాల్గొన్న ప్రముఖులు: ఈ సమావేశంలో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్కుమార్, देशపతి శ్రీనివాస్, సురభివాణిదేవి, దామోదర్ తదితరులు పాల్గొన్నారు.

