
న్యూఢిల్లీ: పశ్చిమాసియా (Middle East) లో యుద్ధం తీవ్రస్థాయికి చేరినప్పటికీ, భారతదేశానికి అవసరమైన ఇంధన సరఫరా ఆగడం లేదు. శత్రువుల దాడులు జరుగుతున్నా, ప్రాణాలకు తెగించి భారతీయ నౌకలు క్రూడ్ ఆయిల్ మరియు ఎల్పీజీ (LPG) తో దేశం వైపు వస్తున్నాయి.
కీలక పరిణామాలు:
-
జగ్ లాడ్కి సాహసం: యూఏఈలోని ఫుజైరా (Fujairah) పోర్టుపై శనివారం దాడులు జరిగిన సమయంలో ‘జగ్ లాడ్కి’ (Jag Ladki) నౌక అక్కడే చమురు నింపుకుంటోంది. భయానక పరిస్థితులు ఉన్నప్పటికీ, ఏమాత్రం వెనక్కి తగ్గకుండా 80,800 టన్నుల ముర్బాన్ క్రూడ్ (Murban Crude) లోడ్ చేసుకొని నిన్న భారత్కు తిరుగుప్రయాణమైంది.
-
ఎల్పీజీ నౌకల రాక: గ్యాస్ కొరత రాకుండా ఉండేందుకు శివాలిక్ (Shivalik) మరియు నందాదేవి (Nanda Devi) అనే రెండు భారీ నౌకలు మొత్తం 92,712 టన్నుల ఎల్పీజీతో భారత్ చేరుకోనున్నాయి.
-
భారత్ వ్యూహం: భారత నౌకల రక్షణ కోసం ఇండియన్ నేవీ ఇప్పటికే యుద్ధ నౌకలను రంగంలోకి దించింది. మన నౌకల ప్రయాణాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ, సురక్షిత మార్గాలను సూచిస్తోంది.

