
అయిటిపాముల కేంద్రంలో కొనుగోలు లెక్కలు:
ఈ నెల 6వ తేదీన కట్టంగూర్ మండలం అయిటిపాముల కొనుగోలు కేంద్రంలో ముగ్గురు రైతులకు చెందిన మొత్తం 634 బస్తాల ధాన్యాన్ని కేంద్ర నిర్వాహకులు కొనుగోలు చేశారు.
-
రైతుల వారీగా బస్తాల వివరాలు:
-
గాదరి ప్రసాద్:
524బస్తాలు -
పెద్ది ఎల్లమ్మ:
82బస్తాలు -
మామిడి గోపయ్య:
27బస్తాలు
-
-
కేంద్రంలో తూకం: నిబంధనల ప్రకారం ఒక్కో బస్తాకు 42 కేజీల చొప్పున (ధాన్యం బరువు + బస్తా బరువు) కాంటా వేసి, మొత్తం 266 క్వింటాళ్ల ధాన్యంగా రికార్డుల్లో అధికారికంగా నమోదు చేశారు.
రైస్ మిల్లులో తరుగు దందా – కట్ అయిన 14.65 క్వింటాళ్లు:
కొనుగోలు ప్రక్రియ ముగిసిన అనంతరం సదరు 634 బస్తాల ధాన్యాన్ని అధికారులు చెర్వుఅన్నారం గ్రామంలో ఉన్న శివసాయి రైస్ మిల్లుకు లారీ ద్వారా తరలించారు. అయితే లారీ మిల్లుకు చేరుకున్నాక అసలు కథ మొదలైంది:
-
మిల్లర్ల ఇష్టారాజ్యం: లారీ దిగుమతి సమయంలో రైస్ మిల్లు యాజమాన్యం ఒక్కో బస్తాకు ఏకంగా 2 కేజీల చొప్పున తరుగు (తరుగుదల) తీసివేసి, కేవలం 40 కేజీల చొప్పున మాత్రమే తిరిగి తూకం వేశారు.
-
షాక్లో రైతులు: మిల్లు యాజమాన్యం లెక్కల ప్రకారం మొత్తం లోడ్లో ఏకంగా 14.65 క్వింటాళ్ల ధాన్యం తక్కువగా చూపించారు. దీంతో ఒక్కసారిగా రైతులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. కొనుగోలు కేంద్రం రికార్డులకు, మిల్లు రికార్డులకు భారీ వ్యత్యాసం రావడంతో తాము ఆర్థికంగా దారుణంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు.
బాధ్యతారాహిత్యంగా సమాధానాలు – రైతుల ఆందోళన:
తమ కళ్ల ముందే క్వింటాళ్ల కొద్దీ ధాన్యం మాయమవ్వడంపై రైతులు రైస్ మిల్లు యాజమాన్యాన్ని నిలదీయగా.. “మాకు సంబంధం లేదు, ఏమైనా ఉంటే మీ ఐకేపీ కేంద్ర నిర్వాహకులనే అడగండి” అని సమాధానం ఇచ్చారు. తీరా అయిటిపాముల కేంద్ర నిర్వాహకులను అడిగితే.. “మాకేమీ తెలియదు” అంటూ అత్యంత నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా సమాధానం ఇస్తున్నారని బాధిత రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.
రైస్ మిల్లర్లు, కేంద్ర నిర్వాహకుల తీరుపై ఉన్నతాధికారులు స్పందించి, తక్షణమే క్షేత్రస్థాయి విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కట్టంగూర్ మండల రైతాంగం డిమాండ్ చేస్తోంది.

