మునుగోడులో బీఆర్‌ఎస్‌ సమరశంఖం – రైతు భరోసా ఎగ్గొట్టారంటూ జగదీష్‌రెడ్డి ధ్వజమెత్తారు!

ముఖ్యమంత్రి బీజేపీకి తొత్తుగా మారారు – ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌:

బీఆర్‌ఎస్‌ ఉమ్మడి నల్లగొండ, సూర్యాపేట జిల్లాల ఇన్‌చార్జి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు:

“తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోపాయికారీగా బీజేపీకి తొత్తుగా మారి వెన్నుపోటు రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఒక బాలికపై దారుణంగా అత్యాచారానికి ఒడిగట్టిన బండి భగీరథను కనీసం మూడు నెలల పాటు జైల్లో ఉంచాల్సింది పోయి.. నెల రోజులు కూడా గడవకముందే తెరవెనుక చక్రం తిప్పి బెయిల్‌ ఇప్పించి బయటకు తెచ్చారు.”

మునుగోడు గులాబీ శ్రేణుల భారీ హాజరు:

మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ విస్తృత స్థాయి అవగాహన సదస్సులో ఉమ్మడి నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు పాల్గొన్నారు.

సమావేశంలో పాల్గొన్న ప్రముఖులు: భువనగిరి పార్లమెంట్‌ ఇన్‌చార్జి క్యామ మల్లేష్‌, కల్లుగీత కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ పల్లె రవికుమార్‌ గౌడ్‌, మాజీ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర సీనియర్ నాయకురాలు పాల్వాయి స్రవంతిరెడ్డి ఈ వేదికపై పాల్గొన్నారు.

వీరితో పాటు మునగాల నారాయణరావు, కర్నాటి వెంకటేష్‌, పల్లె కళ్యాణి, పెద్దింటి బుచ్చిరెడ్డి, మందుల S. సత్యం, నల్లగొండ అంజి, పగిళ్ల సతీష్‌, మాదరబోయిన పరమేష్‌ మరియు మునుగోడు నియోజకవర్గ పరిధిలోని మండలాధ్యక్షులు, జెడ్పీటీసీలు, బూత్ స్థాయి ఏజెంట్లు (BLAs) పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.