
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరణాలు:
-
జనగం రాంబాబు (43): గుండాల మండలం లింగగూడేనికి చెందిన ఈయన వడదెబ్బతో మృతి చెందారు.
-
ముక్కవరపు వెంకటేశ్వర్లు (65): ఇల్లెందు మండలం ఆజాద్నగర్కు చెందిన పురోహితుడు ఎండ తీవ్రతకు తాళలేక కన్నుమూశారు.
-
దాగం సీతమ్మ (60): చర్ల మండలం ఆర్.కొత్తగూడెం జీపీ పరిధిలోని దానవాయిపేటకు చెందిన ఈమె వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోయారు.
ఖమ్మం జిల్లా పరిధిలో సంభవించిన మరణాలు:
-
గుర్తుతెలియని యాచకుడు (65): ఖమ్మం నగరంలో ఓ వృద్ధ యాచకుడు ఎండ తీవ్రత కారణంగా మరణించారు.
-
పాముల శ్రీను (53): కొణిజర్లకు చెందిన ఈ ఉపాధి హామీ కూలీ పనుల నేపథ్యంలో వడదెబ్బకు గురై మృతి చెందారు.
-
యార్లగడ్డ గోవర్దన్రావు (70): ఖమ్మం ముస్తఫానగర్కు చెందిన ఈయన శానిటరీ పనులు చేస్తూ జీవనం సాగించేవారు. వడదెబ్బతో ఈయన ప్రాణాలు విడిచారు.
-
షేక్ సలీం (42): ఖమ్మం ముస్తఫానగర్కే చెందిన ఎలక్ట్రీషియన్గా పనిచేసే ఈయన కూడా ఎండ దెబ్బకు బలయ్యారు.
-
పుట్టపర్తి భద్రమ్మ (60): చింతకాని మండలం పాతర్లపాడుకు చెందిన ఈమె చింతచిగురు అమ్ముకుంటూ జీవించేవారు. వడదెబ్బ తగలడంతో మరణించారు.
-
నాగయ్య (55): ఖమ్మం బొక్కలగడ్డ ప్రాంతానికి చెందిన ఈయన ఒక పూల దుకాణంలో పనిచేస్తూ ఎండ తీవ్రతకు గురై కన్నుమూశారు.
-
అచ్యుత్రావు (70): పరిగిముక్కల కాలనీకి చెందిన ఈ వృద్ధుడు వడదెబ్బతో మృతి చెందారు.
-
కోట నిరంజన్ (60): మధిర మండలం ఇల్లూరు గ్రామానికి చెందిన ఈయన బంధువుల అంత్యక్రియలకు వెళ్లివచ్చిన తర్వాత వడదెబ్బ కారణంగా తీవ్ర అస్వస్థతకు గురై మరణించారు.

